Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో కథానాయిక మణాల్ ఠాకూర్ శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
' దుల్కర్ సల్మాన్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా నాకు గొప్ప ఎచీవ్మెంట్. ఈ సినిమాలో సీత పాత్రకు నన్ను ఎంపిక చేయటం చాలా ఆనందంగా ఉంది. కెరీర్లో అరుదుగా వచ్చే పాత్ర ఇది.అన్ని ఎమోషన్స్తో ఉన్న అరుదైన సినిమా ఇది' అని తెలిపారు.