Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపి వేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ నలుగురు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ, మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు' అని డా.ప్రతాని రామకష్ణ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'మా టియఫ్సీసీలో ప్రస్తుతం యాభై మంది నిర్మాతలు సినిమా చిత్రీకరణలు నిర్వహిస్తున్నారు. నా సినిమా చిత్రీకరణ కూడా జరుగుతోంది. ఇంకా రెండు రోజులే బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రీకరణలను ఆకస్మాత్తుగా ఆపేస్తే వర్కర్స్తో పాటు మిగతా వారందరికీ ఇబ్బంది కలుగుతుంది. కొందరు తమ స్వార్థం కోసం ముఖ్యమంత్రులను కలిసి టికెట్ రేట్లు పెంచుకున్నారు. మళ్లీ థియేటర్స్కి ఆడియన్స్ రావడం లేదనీ చిత్రీకరణలు నిలిపివేయాలంటున్నారు. సినిమా చిత్రీకరణలు ఆపే సమస్య లేదు. మీకు మీరే టికెట్ రేట్లు పెంచాలి, చిత్రీకరణలు బంద్ చేయాలంటూ నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మా సినిమాలకు మీరు థియేటర్స్ ఇవ్వరు, ఓటీటీకి సినిమాలు ఇవ్వొద్దు అంటే చిన్న నిర్మాతలు బతికేదెలా?, ఆ పదిమంది నిర్మాతలే బతకాలా?, మీకు లాభాలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి..మీకు ఇబ్బంది వస్తే రూల్స్ మార్చడం, చిత్రీకరణలు నిలిపేయడం కరెక్టా? పర్సెంట్ విధానం ఎందుకు తీసుకరావడం లేదు?, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అన్నీ ఆ నలుగురు నిర్మాతలే. ఎవరిదైన చిత్రీకరణ ఆపితే ప్రభుత్వం ద్వారా, మా ఛాంబర్ ద్వారా వారిని ఎదుర్కొంటాం' అని తెలిపారు.