Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో 'శుక్ర' దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా 'మాటరాని మౌనమిది'. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లవ్ స్టొరీ, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో మల్టీ జోనర్గా రూపొందుతున్న ఈ సినిమా తుది హంగుల్లో ఉంది. ఈనెల 19న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ను అగ్ర కథానాయకులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ బ్లెస్సింగ్స్తో రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించారు. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. అవి ఇప్పటిదాకా తను చూడని, విననివి. ఆ ఇన్సిడెంట్స్ అందరినీ షాక్కు గురిచేస్తాయి. ఆ ఘటనలు ఏంటి?, అంతు చిక్కని అదశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచింది. ఈనెల 19న ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
మా దర్శకుడు సుకు పూర్వాజ్ తెరకెక్కించిన 'శుక్ర' సినిమా అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని సైతం మెప్పించింది. దీంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. అందరి అంచనాలను రీచ్ అయ్యేలా సుకు ఈ చిత్రాన్ని తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించాడు. నయా మల్టీ జోనర్ సినిమాగా ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాతో మా బ్యానర్లకు మంచి పేరు, గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం' అని మేకర్స్ తెలిపారు.
మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, నిర్మాతలు : రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, పీబీవీ శ్రీనివాసులు, దర్శకుడు : సుకు పూర్వాజ్.