Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకుల ముందుకు ఓ మంచి సినిమా రావాలంటే నిర్మాత అభిరుచి, ప్యాషన్ కచ్చితంగా ఉంటాయి. ఎంతో మంది నిర్మాతలు సినిమా మీద ప్యాషన్తో గొప్ప, గొప్ప సినిమాలను నిర్మిస్తుంటారు. అలాంటి ఓ ధ్యేయంతోనే ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఇండిస్టీలోకి వచ్చి, విజన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా 'తీస్ మార్ ఖాన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నాటకం' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, 'సినిమా చూశాను. ఎంతో అద్భుతంగా వచ్చింది. అనుకున్నదానికంటే సినిమా ఎంతో బాగా వచ్చింది. ఆది సాయికుమార్ చాలా కొత్తగా కనిపించారు. ఆది, పాయల్ రాజ్ పుత్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సినిమా చూసిన తర్వాత మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం. నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు. స్టూడెంట్, రౌడీ, పోలీస్గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం సినిమాకు మేజర్ అసెట్. సాయి కార్తీక్ సంగీతం, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్తో స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. వినూత్న ప్రమోషన్తో మా చిత్రాన్ని ఈనెల 19న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.