Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.
రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈనెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ 'విశాఖ తీరంలో సీతారామం' గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. వేలాదిమంది అభిమానులు పాల్గొన్న ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
ఈ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్, సుమంత్, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ వేదికపై 'ఇందందం' పాట పాడి హీరో దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''మహానటి' సినిమాలో భాగం కావడం నా అదష్టం. 'అమ్మాడి' అనే ఒక్క మాటతో మీ అందరి మనసులో చోటు సంపాదించుకున్నాను. వైజాగ్ బీచ్లో రోడ్ షో చేద్దామని అనుకున్నప్పుడు ఎవరైనా వస్తారా అని అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పని మీ ప్రేమ నిరూపించింది. ఇంత గొప్ప ప్రేమని పొందిన నేను అదష్టవంతుడ్ని. తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఈ సినిమా అద్భుతమైన దశ్యం కావ్యం' అని చెప్పారు.
'ఇంతమంది అభిమానుల ప్రేమని నా కెరీర్లో ఎప్పుడూ చూడలేదు. 'సీతా రామం' టీమ్తో పని చేయడం మర్చిపోలేని అనుభూతి' అని నాయిక మణాల్ ఠాకూర్ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ, 'నా కెరీర్లో తొలిసారి చాలా కీలకమైన సపోర్టింగ్ రోల్ చేశాను. ట్రైలర్లో కొంత మాత్రమే చూశారు. నేను సినిమాలో ఏం చేస్తానో అనేది మిస్టరీగా ఉంటుంది. ఈనెల 5న బంగారం లాంటి సినిమా మీ ముందుకు వస్తోంది' అని తెలిపారు.