Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్' (సాలా క్రాస్బ్రీడ్). ఈనెల 25న విడుదల కానుంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, 'అక్డీ పక్డీ', 'వాట్ లగా దేంగే' పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
విజయ్ దేవరకొండ, లైగర్ టీమ్ ముంబైలోని ఒక మాల్కి వెళ్తే, బాలీవుడ్ ప్రెస్, ట్రేడ్ను ఆశ్చర్యపరిచే విధంగా ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. తాజాగా చిరంజీవి 'గాడ్ ఫాదర్' సెట్ను 'లైగర్' చిత్ర బందం సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్పై స్పెషల్ సాంగ్ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది 'లైగర్' టీమ్.
పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్గా, థారులాండ్కు చెందిన కెచా స్టంట్ మాస్టర్గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రారు, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, స్టంట్ డైరెక్టర్: కేచ.