Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం..మోడు బారిన మనసులోనే పలికిందేదో ప్రాణం..పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి.. చేయందించమంది ఒక పాశం.. రుణ పాశం.. విధి విలాసం' అంటూ ప్రేమ, పాశం, అనుబంధం గురించి తీపి అనుభూతులను అనుభవిస్తున్నాడు 'బింబిసారుడు'.
అసలు త్రిగర్తల సామ్రాజ్యాధిపతి అయిన బింబిసారుడు ఈ కాలానికి ఎందుకు వచ్చాడు?, ఎవరితో స్నేహం కోరి వచ్చాడు?, ఆయన ఏ పని కోసం వచ్చాడో ఆ పని నేరవేరిందా? ఆ వ్యక్తిని కలుసుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం 'బింబిసారుడు' సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'బింబిసార'. ఈనెల 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి 'నీతో ఉంటే చాలు..' అంటూ సాగే ఎమోషనల్ లిరికల్ వీడియో సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాటను స్వయంగా కీరవాణి రాయటం విశేషం. మోహన భోగరాజు, శాండిల్య పాటను ఆలపించారు. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఈ సినిమాలో 'బింబిసారుడు'గా కళ్యాణ్రామ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, అలాగే ఆయన అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తుంది. గతంలో ఎన్నడూ పోషించని పాత్రలో కళ్యాణ్రామ్ నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు' అని చిత్ర బృందం తెలిపింది.