Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.
ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథా నాయికలుగా నటించారు. మరో నాయిక అంజలి స్పెషల్ సాంగ్ 'రారా రెడ్డిలో..'లో సందడి చేయనుంది.ఈనెల 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల అవుతున్న నేపథ్యంలో నాయికల్లో ఒకరైన కతిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
కరోనా తర్వాత టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా వరుస సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. నాలోని ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. వరుస సినిమాలు చేయడాన్ని బాగా ఎంజారు చేస్తున్నాను.
ఈ సినిమాలో నా పాత్ర పేరు స్వాతి. సింపుల్ అండ్ ఇన్నోసెంట్. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సీన్ని బట్టి ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా బ్యూటీఫుల్గా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
నేను విన్న వెంటనే ఓకే చెప్పిన స్క్రిప్ట్ ఇది. చాలా అద్భుతమైన కథ. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పొలిటికల్ టచ్తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజ్గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని ఎంతగానో ఇష్టపడతారు. ఈ చిత్రం ఒక లాంగ్ వీకెండ్లో వస్తోంది. కాబట్టి కచ్చితంగా ఫ్యామిలీస్ అంతా థియేటర్కి వచ్చి ఎంజారు చేస్తారనే నమ్మకంతో ఉన్నాం.
ఈ సినిమాతో నాకు నితిన్ మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అందమైన అమాయకత్వం కూడా ఉంది. ఇరవై ఏళ్ళుగా ఆయన ఇండిస్టీలో ఉన్నారు. నన్ను కూడా దీవించమని కోరాను (నవ్వుతూ). 'జయం' సినిమాలో ఎలా ఉన్నారో.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్గా ఉన్నారు.
ఈ సినిమా సెట్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ గారు..ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. అందరూ నన్ను ఎంతో ఇష్టంగా చూసుకున్నారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. వారు మాట్లాడే విధానంలో నాపై చాలా ప్రేమ ఉందని అర్ధమౌతుంటుంది. చాలా మంది నాకు ఫుడ్, స్వీట్స్ పంపారు. వారు చూపిన ప్రేమకి చాలా థ్యాంక్స్.
దర్శకుడు రాజశేఖర్ గారు చాలా కూల్ పర్శన్. ఎప్పుడూ కోపం రాదు. చిరాకు పడరు. సీన్ చెప్పడానికి చాలా ఎగ్జైట్ అవుతుంటారు. ప్రతి సీన్ని చాలా క్లియర్గా చెప్తారు. ఫస్ట్ టైం దర్శకుడిలా అనిపించరు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. నాతో మరో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటాను. ఆయనకి గొప్ప విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను.
'ఉప్పెన' తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర చేయలేదనే ఆలోచన వస్తుంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. నాలో వెర్సటాలిటీ నిరూపించుకుని, మంచి ఎంటర్టైనర్ కావాలని ఉంటుంది.
'ఉప్పెన'లో చాలా సాంప్రదాయంగా కనిపించాను. ప్రేక్షకులు నన్ను ఆ పాత్రలో చాలా ఇష్టపడ్డారు. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చడం చాలా అదష్టంగా భావిస్తున్నాను. నా పాత్రని ఎంతగానో రిలేట్ చేసుకున్నారు. అయితే అన్నీ అలాంటి పాత్రలే చేయాలని లేదు కదా.. నటనకు వెర్సటాలిటీ ముఖ్యం. అందుకే 'ఉప్పెన' తర్వాత వెంటనే 'శ్యామ్ సింగరారు'లో పూర్తి భిన్నంగా ఉండే పాత్ర చేశాను. నా మొదటి సినిమాలో విజరు సేతుపతి లాంటి గొప్ప వర్సటాలిటీ ఉన్న స్టార్తో పని చేశాను. ఇకపై కూడా మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తా.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ఆలోచన అయితే ఇప్పటికి లేదు. అది చాలా బాధ్యతతో కూడుకున్న అంశం. దర్శక, నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తాను.
బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అటు వెళ్ళే ఆలోచన లేదు. తెలుగు, తమిళ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఆనందాన్ని ఇస్తుంది.
సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలంటే, నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలని ఉండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.
ముంబైలో ఉన్నప్పుడు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకునేవాళ్ళం. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మే. అమ్మ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు.
ప్రస్తుతం సూర్య గారితో, నాగచైతన్యతో, దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాల్లో నటిస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి.