Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో 'కార్తికేయ' చిత్రానికికి సీక్వెల్గా వచ్చిన చిత్రం 'కార్తికేయ 2'. శనివారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న సందర్భంగా 'కార్తికేయ 2' చిత్ర బందం థ్యాంక్స్ మీట్ని ఏర్పాటు చేసింది.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ,'దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని తెలిపారు.
'రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని దర్శకుడు చందు మొండేటి అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ, 'మా సినిమాకి యూఎస్ నుంచి ముందుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేశాం. ఇక్కడ సినిమా అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నీ చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీశాడు. ఈ చిత్ర విజయాన్ని లెజెండరీ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం చేస్తున్నాం' అని తెలిపారు.