Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ శిష్యుడు విశ్వను దర్శకుడిగా పరిచయం చేస్తూ, గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం 'గీత'. 'మ్యూట్ విట్నెస్' అనేది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.
హేబా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సునీల్ ముఖ్యపాత్ర పోషించగా, 'నువ్వే కావాలి, ప్రేమించు' వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్గా నటించారు.
ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, 'ఈ సినిమా అవకాశం నా గురువు వినాయక్ గారు ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని అన్నారు. 'గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈనెల 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అని నిర్మాత ఆర్.రాచయ్య చెప్పారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ.