Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కార్తికేయ 2' సినిమాలోని నా పాత్రకు థియేటర్స్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అది నాకు మంచి ఎనర్జీ ఇచ్చినట్లు అనిపించింది' అని కథానాయిక అనుపమా పరమేశ్వరన్ చెప్పారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కార్తికేయ 2'.
ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ నెల 13న థియేటర్స్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్బంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో ముచ్చటించారు.
'చందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మనుషుల్లో ఉన్న మంచితనాన్ని నేను దైవంగా భావిస్తాను. ఈ సినిమాలో కష్ణతత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం నాకొచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా వదులుకున్నాను. ఇందులో నా ఎంట్రీ చూసి జేమ్స్ బాండ్ టైప్లో ఎంట్రీ ఇచ్చావని అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు. నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాను. నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్గా ఉండాలి. అలాంటి పాత్రలు నాకు బాగా నచ్చుతాయి. ఒక ఆర్టిస్ట్గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ఉంది. '18 పేజెస్' సినిమా తర్వాత రెండు సినిమాలు చేస్తున్నాను. అలాగే మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి' అని అనుపమా పరమేశ్వరన్ చెప్పారు.