Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. కతిశెట్టి నాయిక. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్ పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి 'మీరే హీరో లాగ' పాటని మీడియా సమక్షంలో దర్శకుడు హను రాఘపుడి లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ,'ఈ పాటను ప్రెస్, మీడియాకి డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి గారు కథకు న్యాయం చేసే దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఇంద్రగంటి గారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉంది' అని అన్నారు.
'నేను కూడా జర్నలిస్ట్ గా పని చేశాను. చాలా ఇంటర్వ్యూలు చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో ఇంట్రో సాంగ్ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనని రామజోగయ్య శాస్త్రి గారికి చెప్పాను. ఆయన అద్భుతంగా రాశారు. సంభాషణని సంగీతంలో ఇమడ్చడం కష్టమైన పక్రియ. వివేక్ వండర్ ఫుల్గా కంపోజ్ చేశారు. ఇది నా మోస్ట్ ఎమోషనల్ ఫిల్మ్' అని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కష్ణ తెలిపారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, 'ఇంద్రగంటి మోహన కష్ణ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలన్నీ సహజంగా ఉంటాయి' అని అన్నారు. నాయిక కతి శెట్టి మాట్లాడుతూ, ' ఇది మీడియా, హీరో గారి మధ్యలో ఉన్న ప్రత్యేకమైన పాట. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ కావాలంటే మీడియా, పీఆర్వోల పాత్ర కీలకం. బెంచ్ మార్క్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని చెప్పారు.
సమర్పకులు గాజులపల్లె సుధీర్ బాబు మాట్లాడుతూ, 'సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన హను రాఘవపూడి గారికి థ్యాంక్స్. మూడు రోజుల క్రితమే సినిమా చూశాం. సినిమా. అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా హిట్ కొడతాం. ఇంద్రగంటి గారు మాకు అవకాశం ఇవ్వడమే మా అదష్టం. సుధీర్ బాబు, కతి శెట్టి అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేశారు' అని తెలిపారు.