Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొంత కాలంగా మహేష్బాబు, త్రివిక్రమ్ అభిమానులందరూ ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
ఈ అప్డేట్తో అటు మహేష్బాబు, ఇటు త్రివిక్రమ్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
మహేష్ బాబుకు ఇది 28 వ చిత్రం కావడం, ఈ సినిమా విడుదల తేదీ కూడా 28వ తేదీ కావడం విశేషంగా భావిస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో మరో బ్లాక్బస్టర్గా ఎస్.రాధాకష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే మరోసారి జోడీగా మెరవనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడుగా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సష్టిస్తున్న తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలను త్వరలోనే మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
'అతడు' బ్లాక్బస్టర్ దగ్గర్నుంచి మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్కి కొనసాగింపుగా వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'ఖలేజా' సైతం ప్రేక్షకుల్ని, మహేష్బాబు అభిమానుల్ని మెప్పించి మరో బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే వీళ్ళిద్దరి కాంబోలో చాలా కాలం తర్వాత మూడో సినిమా సెట్ కావడం ఓ విశేషమైతే, ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచి దీన్ని హ్యాట్రిక్ బ్లాక్బస్టర్గా అందరూ పాజిటివ్గా అనుకోవడం మరో విశేషంగా అందరూ భావిస్తున్నారు.