Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుందీ చిత్రం. 'పీయస్-1'ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రారు బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రంలోంచి 'చోళ చోళ' అనే పాటను విడుదల చేశారు.
ఈ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ, 'నాకు మణి సర్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆయనతో ఇది వరకు 'రావణ్' సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేశాను. మణి గారితో పని చేస్తున్నానంటే అది నాకు కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చుని అనుకున్నాను. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు. ఈ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు మణిగారికి థ్యాంక్స్' అని అన్నారు.
'మణిరత్నం గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశాను. ఇందులోని ప్రతీ ఒక్క పాత్రకు ఓ లక్ష్యం ఉంటుంది.. ఆ గమనంలో ఉండే డ్రామా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ కారెక్టర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రవివర్మన్ కెమెరాపనితనం మీరు చూడబోతున్నారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం' అని హీరో కార్తీ చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ,'అమత అనే సినిమా వల్లే నిర్మాతగా నేను మారాను. ఇప్పుడు 50 చిత్రాలు నిర్మించే నిర్మాతగా నిల్చున్నాను. మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన మణిరత్నం గారికి థ్యాంక్స్. కంటెంట్ బాగుంటే ఎక్కడి నుంచి వచ్చిందని చూడకుండా ఇండియా మొత్తం ఆదరిస్తోంది' అని అన్నారు.
చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ అది ఎందుకు అనేది చెప్పను. తరువాత మీకే తెలుస్తుంది. రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు తీయగలమనే ధైర్యం వచ్చింది. రెండు పార్టులుగా ఇలాంటి చిత్రాలు తీసి మెప్పించవచ్చని ఆయన నిరూపించారు. అందుకే ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డ లాంటి ఈ చిత్రం ఇక దిల్ రాజు గారిదే. ఆయనే తెలుగులో ఈ సినిమాను చూసుకోవాలి. తనికెళ్ల భరణి గారికి థ్యాంక్స్. అలాగే చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను తీయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజారు చేస్తారని ఆశిస్తున్నాను.
- దర్శకుడు మణిరత్నం