Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'మాయ' అనే సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణురాలు). ఆమె చుట్టూ తిరిగే కథతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే 'అర్థం'.
మినర్వా పిక్చర్స్ బ్యానర్పై శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో, 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటీ నటులుగా ఈ సినిమా తెరకెక్కింది.
గతంలో అనేక చిత్రాలకు ఎడిటర్గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో ఈ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. అలాగే మలయాళ, కన్నడ భాషల్లోకి కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. రాధిక శ్రీనివాస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ని టిప్స్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ చేజిక్కించుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక వేడుకలో టీజర్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా హీరోయిన్ శ్రద్ధాదాస్్ మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటి కంటే ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వి.యఫ్.ఎక్స్ ఇంపార్టెంట్. డిఓపి పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను అంతే చక్కగా తెరకెక్కించారు. గ్లామర్ రోల్లో సైకరియటిస్ట్గా నటించాను. ఇందులోని నా పాత్ర కూడా చాలా స్పెషల్గా ఉంటుంది' అని తెలిపారు.
'ఇంతకుముందు నేను తీసిన 'నాటకం ' సినిమాకు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో 'ఖైదీ'కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు. ఆర్ట్ డైరెక్టర్ మణి చాలామంచి సెట్ వేశాడు' అని చిత్ర నిర్మాత శ్రీనివాస్ అన్నారు.
చిత్ర నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ, 'సైకలాజికల్ థ్రిల్లర్ కథకు వినోదాన్ని మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్న చిత్రమిది. ఈ సినిమాకి సంహరించిన అందరికీ ధన్యవాదములు. ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్తో మా సినిమాకి బిగ్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ, 'కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి, ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించాం.అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు ఈ సినిమా నిర్మించారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది' అని అన్నారు.
''నాటకం' సినిమా నుండి మా నిర్మాత శ్రీనివాస్తో ట్రావెల్ అవుతున్నాను. మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఆ సినిమా కంటే పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాను' అని కో ప్రొడ్యూసర్ సాయి దీప్ తెలిపారు.