Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందనని, విమర్శకుల ప్రశంసలనూ పొందుతున్న చిత్రం 'సీతారామం'. ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు విశిష్టమైన గుర్తింపు తెచ్చిపెడుతోంది.
ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ 'సీతారామం' వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంలో ఓ మంచి పాత్రను పోషించడం తనకెంతో సంతప్తిని ఇచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధు నంబియార్.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేసి, నటుడిగా మారిన తనకు 'సీతారామం'లో ఇంటరాగేషన్ ఆఫీసర్ వంటి పాత్ర లభించడం, చిన్న పాత్రే అయినా రష్మిక - సుమంత్ కాంబినేషన్లో చేసిన కీలక సన్నివేశం కావడంతో ఆ క్యారెక్టర్ గురించి బంధువులు, స్నేహితులు, సన్నిహితులే కాకుండా చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ప్రశంసించడం తనకు ఓ కొత్త ఎనర్జీని ఇస్తోందని ఆయన చెబుతున్నారు.
ఈ సందర్భంగా 'సీతారామం'లో మంచి పాత్రనిచ్చి ప్రోత్సహించిన నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నదత్, ప్రియాంక దత్, దర్శకుడు హను రాఘవపూడికి, దర్శకత్వ శాఖకు చెందిన రవితేజ చెరుకూరికి ఆయన కతజ్ఞతలు తెలిపారు.
'సీతారామం'తో పాటుగా ఈ మధ్య వచ్చిన 'సర్కారువారి పాట', 'గంధర్వ', 'దర్జా' తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన తనకు ఇప్పుడు మాత్రం కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతున్నాయని మధు నంబియార్ అన్నారు. ఇప్పటికి 20 చిత్రాల్లో చేశాననీ ప్రస్తుతం విజరు దేవరకొండ - సమంత 'ఖుషీ' చిత్రం, బసవరామ తారకం ఆర్ట్స్ పతాకంపై వస్తున్న నందమూరి చైతన్య కష్ణ సినిమా, వీటితోపాటు మరో మూడు సినిమాలు, అలాగే ఒక తెలుగు - తమిళ ద్విభాషా చిత్రం, ఓ వెబ్ సిరీస్ లోనూ మంచి పాత్రలు పోషిస్తోన్నట్లు చెప్పారు. అలాగే ప్రధాన చిత్రాలతో పాటు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణం తనవంటి ఎందరో నటీ నటులకు వరంగా మారిందని, విరివిగా అవకాశాల్ని అందిస్తోందని అన్నారాయన. ప్రేక్షకులు కూడా పాత్రలకు తగ్గ నటీనటులనే ఆదరిస్తూ ఉండడం తనలాంటి ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా నిలుస్తోందని మధు నంబియార్ చెప్పారు. ప్రేక్షకులతో విలక్షణమైన నటుడు అని, పరిశ్రమతో క్రమశిక్షణ కలిగిన నటుడునని అనిపించుకోవడమే తన లక్ష్యం అని, ఏ పాత్ర చేసినా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటుడుగా సంతృప్తికర ప్రయాణం చేయాలని ఉందని మధు నంబియార్ తెలిపారు.