Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం..ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి'.
ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రావణ్ నిట్టూరు కథానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన 'మా తిరుపతి..' పాట విశేష ఆదరణతో సెన్సేషనల్ చార్ట్ బస్టర్గా నిలిచింది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్గా మారిపోయింది. వెటరన్ సింగర్ శంకర్ మహదేవన్, యూత్ సింగింగ్ స్టార్ రమ్య బెహార కలిసి పాడిన ఈ పాట, ఇప్పుడు అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఇక యూట్యూబ్లో అయితే మిలియన్స్ వ్యూస్, లైక్స్తో దూసుకుపోతోంది. సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ ఈ పాటని అద్భుతంగా స్వరపరచగా, కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అలరిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకతషా, బొమ్మకంటి రవీందర్, అమత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 'మా తిరుపతి ..'పాట అందరినీ ఆకట్టుకుని, సినిమాపై మరింత పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసింది అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి దర్శకత్వం : ఆనంద్ జె, నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి, డీవోపీ: డిజికె, సంగీతం : ఫణి కళ్యాణ్, ఎడిటర్ : సత్య గిడుతూరి.