Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్బస్టర్గా నిలిచిన చిత్రమిది. 350 కోట్లకు పైగా వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. సినిమా కంటే కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని ఊపేసింది. డైలాగులు, మేనరిజమ్స్, పాటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనపై ప్రశంశల వర్షం కురిసింది. తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కరోనా సమయంలో కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసి, అల్లు అర్జున్ని పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది.
మొదటి భాగం చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్, సుకుమార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా రెండో భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు 'పుష్ప 2' ప్రారంభంతో సమాధానం దొరికింది. సోమవారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కానుంది.