Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'సాక్షి'. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి విలన్గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను, ఈ చిత్ర టైటిల్ లోగోను నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము (దామోదర ప్రసాద్) సంయుక్తంగా రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, 'అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా 'సాక్షి' సినిమాలో విలన్గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థ్యాంక్స్. వారు మా సినిమా కోసం ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన శరణ్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్, నాగబాబు గారు మెయిన్ విలన్గా ముఖ్యమైన పాత్రలో నటించారు. అజరు, ఇంద్రజ, ఆమని.. ఇలా పెద్ద క్యాస్టింగ్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ లలిత, సినిమాటోగ్రఫీ: చైతన్య కందుల, ఆర్ట్: కె.వి.రమణ, ఎడిటర్: సెల్వ కుమార్.