Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ పుట్టపర్తి సాయిబాబాని ఆయన భక్తులు కదిలే దైవంగా చూస్తారు. ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి స్వామి గురించి ఇప్పటితరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే మంచి సంకల్పంతో 'శ్రీసత్యసాయి అవతారం' చిత్రం వెండితెరకెక్కబోతోంది. కన్నడ, తెలుగు భాషల్లో అందరికీ తెలిసిన దర్శకుడు సాయి ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషమైతే, ఆయనకిది 100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు ప్రముఖ డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి లోగోను ప్రసాద్ల్యాబ్లో జరిగిన వేడుకలో మురళీమోహన్, సుమన్, సి.కళ్యాణ్ ఆవిష్కరించారు.
దర్శకుడు సాయి ప్రకాష్ మాట్లాడుతూ, 'నేను దైవంగా భావించే స్వామివారు నా గురించి తెలుసుకుని 'షిర్డిసాయిబాబా' సినిమా చేయాలని ఆశీర్వదించారు. స్వామివారు ఆ సినిమా చూశారు. ఆ సినిమాకి 108రోజుల పండగ కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆ స్వామివారిపై సినిమా చేసే భాగ్యం కలిగింది. 1994లోనే స్వామివారిపై రాసిన స్క్రిప్ట్ ఇంకా మ్యూజియంలో ఉంది. ఇప్పుడు స్వామివారి దయ, భక్తుల అనుగ్రహంతో నా దగ్గరకు వచ్చింది. స్వామివారిపై సినిమా తీస్తున్నానని ఓ సందర్భంలో డా. దామోదర్గారికి పుట్టపర్తిలో చెప్పాను. ఈ సినిమా నేనే నిర్మిస్తానని ముందుకు వచ్చారు' అని తెలిపారు.