Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం బ్యాక్ డ్రాప్లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'అంతేలే కథ అంతేలే'.రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్, వికాస్ వశిష్ట, సహర్ కృష్ణన్, శ్రీనివాస్ నటీనటులుగా శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.
సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ, 'రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్ల్లో మూడు షెడ్యూల్స్లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓ మంచి కాన్సెప్ట్తో తెరకెక్కిస్తున్న చిత్రమిది' అని తెలిపారు. 'ఇలాంటి సినిమాలను చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్తో ఉన్న పాత్ర చేస్తున్నాను. ఇందులో హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి' అని హీరో తనీష్ చెప్పారు.
హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ, ''సినిమా బండి' తరువాత చేస్తున్న ఈ సినిమా టైటిల్లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు. చాలా నచ్చింది. ఇందులో ఎక్కువ మాటలు ఉండవు. కానీ ఎమోషన్ మాత్రం కథను క్యారీ చేస్తుంది. ఈ సినిమా కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'నా యాక్టింగ్ చూడకుండానే ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. నాకు ఇచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోషిస్తాను. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని హీరోయిన్ సహార్ కృష్ణన్ అన్నారు.
నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, 'నేను సీనియర్ నటి గీతాంజలి, రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని పాత్ర ఇచ్చే గుర్తింపుతో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు.