Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం 'అలా నిన్ను చేరి'.
'హుషారు' సినిమాతో సక్సెస్ కొట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకష్ణ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గురువారం ఘనంగా జరిగింది.
హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి, హనుమంతరావు, కష్ణారావు, గరుడవేగ అంజి, 'హుషారు' ఫేమ్ తేజస్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా, పి.జి. వింద కెమెరామెన్గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.