Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన ముగ్గురి లవ్ స్టోరీ', 'సెబాస్టియన్ పిసి 524', 'పంచ తంత్రం' వంటి సినిమాల ద్వారా సినిమాటోగ్రాఫర్గా రాజ్ కె నల్లి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు.
కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్ద్ మీనన్, ఎస్వీ కష్ణారెడ్డి, బాబా భాస్కర్, భరత్ రొంగలి నటీ నటులుగా ఈ చిత్రంలో నటించారు.
'ఎస్.ఆర్.కల్యాణ మండపం' దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామకష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తున్న సందర్భంగా సినిమాటోగ్రాఫర్ రాజ్ కె. నల్లి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'చిన్నప్పుడు 'సఖి, బొంబాయి' సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమాటో గ్రాఫర్గా అవుదామనుకున్నాను. 2014లో మైండ్ స్క్రీన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్స్ పూర్తి చేశాను. ఆ తరువాత 'రారండోరు వేడుక చూద్దాం', 'అర్జున్ సురవరం', 'దేవదాస్', 'ఉప్పెన' సినిమాలకు అసోసియేట్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను. 'ఉప్పెన' సినిమా పూర్తయ్యే టైంలో కష్ణ వంశీ గారు 'రంగ మార్తాండ' సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసే అవకాశం కల్పించారు. ఆ తరువాత 'సెబాస్టియన్ పిసి 524' ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ సినిమా పూర్తి అవ్వగానే 'పంచతంత్రం' చేశాను. ఆ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. కిరణ్తో ఇంతకుముందు 'సెబాస్టియన్..' సినిమా చేసిన కారణంగా తాను ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాకి కూడా నన్నే ఎంపిక చేశారు. కిరణ్తో నాకిది రెండవ ప్రాజెక్ట్. కిరణ్ను డిఫరెంట్గా చూపించాలని, కొత్తగా చూపించాలని ప్రయత్నం చేశాం. సినిమా, సినిమాకి ఇంప్రూవ్ అవ్వడానికి కిరణ్ చాలా కష్టపడతాడు. కిరణ్ చాలా కూల్ గోయింగ్ యాక్టర్. తనకు లైనప్లో 10 సినిమాలున్నాయి. తనకు ఎంత టెన్షన్ ఉన్నా సీన్ దగ్గరికి వచ్చే సరికి సీన్ ఎమోషన్స్, మూడ్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను బేసిగ్గా ఎడిటర్ కాబట్టి ఎడిటర్ పాయింట్ అఫ్ వ్యూలో షాట్ మేకింగ్ చాలా ఇంట్రెసింగ్గా ఉంటుంది. చిత్ర నిర్మాత దీప్తి గారు దేన్నైనా చాలా పాజిటివ్గా హ్యాండిల్ చేస్తారు. ఒక నిర్మాతగా, సినిమాపై తనకున్న ప్యాషన్తో సినిమా బాగా రావాలని తపన పడుతుంటారు. మణిశర్మ పాటలు వింటూ పెరిగిన నేను ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం, ఒక ఫ్యాన్ తన కలను నిజం చేసుకున్న ఫీల్ కలుగుతోంది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రమోద్ హర్ష దర్శకత్వంలో నివేదా పేతురాజ్ సినిమా చర్చలు నడుస్తున్నాయి' అని రాజ్.కె.నల్లి చెప్పారు.