Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు విశ్వక్ సేన్ 'ఫలక్నుమా దాస్'తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు ఆయనే హీరోగా తన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఇదొక రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్త రకమైన థ్రిల్స్ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. 'ఆర్ఆర్ఆర్, హరి హర వీర మల్లు' చిత్రాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బందం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఫుకెట్లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్ను, స్పెయిన్లో ఒక చిన్న షెడ్యూల్ను టీమ్ పూర్తి చేసింది. దీపావళికి ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేసి ప్రమోషన్స్ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్కు కొరియోగ్రఫీ చేయగా, వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ను పర్యవేక్షించారు.
రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ''ఫలక్నుమా దాస్' తర్వాత మా హోమ్ బ్యానర్లో నా దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా 'దాస్ కా ధమ్కీ' . దర్శకుడిగా నన్ను నేను సంపూర్ణంగా పరిచయం చేసుకుంటున్న సినిమా ఇది. అలాగే నటుడిగా నాకు తప్తిని ఇచ్చిన చిత్రమిది. ప్రసన్న అద్భుతమైన కథ ఇచ్చారు. హిలేరియస్ ఎంటర్టైనర్. అదే సమయంలో థియేటర్లో చెమటలు కూడా పడతాయి. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. తెలుగు సినిమాకి కొత్త అప్రోచ్ వచ్చింది. క్లైమాక్స్ ఫైట్ హైలెట్గా ఉంటుంది. లియోన్ జేమ్స్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సినిమా ఖచ్చితంగా సినిమా న్యూ ఏజ్ వైబ్ ఇస్తుంది. థియేటర్లో ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. నా సినిమాలన్నిటికంటే ఇది పెద్ద సినిమా' అని తెలిపారు.
'ఈ సినిమాలో నవరసాలు వుంటాయి. భారీ బడ్జెట్ సినిమా ఇది. అద్భుతమైన కథ. ఎక్కడా రాజీ పడకుండా ఉన్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా తీస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది' అని నిర్మాత కరాటే రాజు చెప్పారు.