Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింహా ప్రధాన పాత్రలో హాల్సియాన్ మూవీస్, ఎంఎఫ్ఎఫ్ ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ప్రొడక్షన్ నెం1గా జెవి మధు కిరణ్ దర్శకత్వంలో 'రావణ కళ్యాణం' సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇవ్వగా, వివి వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె.రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్, సింహా సమర్పకులు. సందీప్ మాధవ్, రాజేంద్ర ప్రసాద్, దీపికా, శత్రు, మధునందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సిింహా మాట్లాడుతూ, 'ఇది చాలా ఆసక్తికరమైన కథ. 'వంగవీటి, జార్జ్ రెడ్డి' చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసిన శాండీ ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఈ సినిమా చుస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతారు' అని అన్నారు.
'ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నాం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో ఒకేసారి విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే కథ ఇది' అని దర్శకుడు జెవి. మధుకిరణ్ చెప్పారు.