Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.విజయ్ కుమార్ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని, కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి నటీనటులుగా రూపొందిన తమిళ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'సినం'. యన్.ఆర్కుమారవేలన్ దర్శకత్వంలో ఆర్.విజయకుమార్ నిర్మించిన రివేంజ్ డ్రామా, అలాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా.
ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆక్రోశం' పేరుతో సీహెచ్ సతీష్ కుమార్, శ్రీమతి జగన్మోహనిల సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు షబీర్ తబరే ఆలం సంగీతం అందిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంతకుముందు మా బ్యానర్లో మంచి కమర్సియల్ కంటెంట్తో వచ్చిన 'ఏనుగు' చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందింది. నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్గా తమిళ 'సినం' ట్రైలర్ను చూసి ఆశ్చర్య పోయాను. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామనే సంతప్తి ఖచ్చితంగా పొందుతారని చెప్పగలను' అని అన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు - జి. యన్ ఆర్.కుమారవేలన్, సంగీతం - షబీర్ తబరే ఆలం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ - మైఖేల్ బి. యఫ్.ఏ, ఎడిటర్ - ఎ రాజమహమ్మద్, స్టోరీ - డైలాగ్ :ఆర్ శరవణన్.