Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాహిర్, పల్లవి హీరో, హీరోయిన్లుగా బత్తిని ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత బి.నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం 'నెక్స్ట్ లెవల్'. ఈ చిత్రంతో గోపీ దేవెళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, శ్రీనివాస్ వంగపల్లి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా విజయం సాధించి, సినిమా టైటిల్కి తగ్గట్టుగా నిర్మాత నరేష్ కుమార్ కూడా 'నెక్ట్స్ లెవల్' ప్రొడ్యూసర్గా ఎదగాలని, అందుకు ఈ సినిమా పునాది కావాలని కోరుకుంటున్నాను. నాకెంతో ఆప్తుడైన దర్శకుడు గోపి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆయన కూడా వేరే లెవల్ నుండి.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్కి వచ్చాడు. ఈ సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంది. నేను అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూశాను. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా అందరూ ఈ సినిమా చూసి, ఈ టీమ్ని ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను' అని అన్నారు.
''మా బత్తిని ఫిల్మ్స్లో చేస్తున్న మొట్టమొదటి చిత్రమిది. మా మొదటి చిత్రంతో అంతా కొత్తవారిని ఎంకరేజ్ చేయాలనే ప్రయత్నం చేశాం. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన దర్శకులు వి.ఎన్.ఆదిత్యగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు' అని నిర్మాత బి.నరేష్ కుమార్ రెడ్డి చెప్పారు.
దర్శకుడు గోపీ దేవెళ్ల మాట్లాడుతూ, 'ఇది నా మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేసి, మా టీమ్ని బ్లెస్ చేసిన వి.ఎన్. ఆదిత్యగారికి కృతజ్ఞతలు. మంచి మెసేజ్తో ఈ చిత్రం తెరకెక్కించాం. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. స్లీపింగ్ ట్యాబ్లెట్పై ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అని తెలిపారు.