Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'.
ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
'తాజాగా 'తార నా తార..' పాటను మేకర్స్ విడుదల చేశారు. నాగ శౌర్య , షిర్లీ సెటియా అందమైన కెమిస్ట్రీని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ని మహతి స్వరపరిచారు. లీడ్ పెయిర్ బైక్ రైడ్కి వెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మధురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా ఉంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం కూడా యూత్ఫుల్గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్గా పాడారు. మొత్తంగా ఈ పాట విడుదలైన మరుక్షణం నుంచే మంచి స్పందన రాబట్టుకోవడం విశేషం. రాధిక శరత్కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 23న విడుదలకు సిద్ధమవుతోంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.
వెన్నెల కిషోర్, రాహుల్ రామకష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: అనీష్ ఆర్. కష్ణ, నిర్మాత: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం: మహతి స్వరసాగర్, డివోపీ: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: బుజ్జి, ఎడిటర్ :తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ : రామ్ కుమార్, డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్.గౌతమ్.