Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుష్పక్, జబ్రర్కల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా రూపొందిన చిత్రం 'గీతా సాక్షిగా'. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ నిర్మించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్స్ విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీతో పాటు హైప్ను పెంచుతూ ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుండి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్తో మరో టీజర్ను విడుదల చేశారు మేకర్స్.
'ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. టీజర్లో నటుడు ఆదర్శ్ను క్రిమినల్గా, రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలిసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు, వాడి బాబు అర్జునుడ్నిరా అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీతో తను చేసే ఫైట్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్తో, బీజీఎంతో అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు' అని చిత్ర యూనిట్త తెలిపింది. ఈ చిత్రానికి కథ-నిర్మాత : చేతన్ రాజ్, స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ఆంథోని మట్టిపల్లి, సంగీతం: గోపీసుందర్, ఆడియో : ఆదిత్య మ్యూజిక్, సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ నరిసేటి, ఎడిటర్: కిషోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నత్యం : యశ్వంత్-అనీష్, ఫైట్స్: పధ్వీ.