Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పృథ్వీరాజ్, అనూ మెహత హీరో, హీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాబరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్గా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పి.నాగమణి సమర్పణలో ప్రవీణ శివరాజ్ నిర్మిస్తున్నారు.
కొత్త తరహా కథ, కథనంతో రూపొందుత్ను ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు పి. మణిరాజ్ మాట్లాడుతూ, '27 రోజుల పాటు వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. అవుట్ఫుట్ చాలా బాగా వచ్చింది. హీరో, హీరోయిన్ చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ పూర్తి సహకారం అందించారు. ఒక రాబరీ బ్యాక్డ్రాప్లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబరు నెలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: పరశురామ్ ఎరుగదిండి, ఎడిటర్: సి. అక్షయరాజ్.