Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈనెల 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్లో గ్రాండ్గా జరగనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత తండ్రీ తనయులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భరత్, సౌరబ్ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.