Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు వంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్'. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చి, సినిమా అద్భుతంగా ఉందని, యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా పవర్ ఫుల్గా ఉన్నాయని చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించింది.
ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్లో గ్రాండ్గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్కి ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేక సంతరించడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్కి హాజరుకాబోతున్నారు. చాలా కాలం తర్వాత తండ్రీ తనయులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
భరత్, సౌరబ్ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.