Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యభరిత చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు, 'వివాహ భోజనంబు' దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేయబోతున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.
కంటెంట్ ప్రధానంగా సినిమాలు నిర్మిస్తున్న హాస్య మూవీస్లో ఈ సినిమా ప్రొడక్షన్ నెం.3గా నిర్మాణం కానుంది. అల్లరి నరేష్తో రూపొందిస్తున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా 'ఊరు పేరు భైరవకోన' నిర్మాణ దశలో ఉంది.
పూర్తి ఫన్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమా ఆదివారం గ్రాండ్గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర, వీఐ ఆనంద్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ పాల్గొన్నారు. ముహూర్తం షాట్కు నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.
గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
శ్రీ విష్ణు, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సహ నిర్మాత :బాలాజీ గుత్తా.