Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్ళు'. విభిన్న కథాంశంతో రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్ జోనర్స్ కలిసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ కార్తీక్, హేబా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ నటిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్ర టీజర్ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇదివరకే 'జల్సా' చిత్రం రీ-రిలీజ్ షోస్లో భాగంగా ఈ చిత్ర టీజర్ను ప్లే చేశారు. అప్పుడు కూడా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది.
ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను, రిలీజ్డేట్ను అధికారికంగా చిత్ర బృందం ప్రకటించనుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత : విప్లవ్ కోనేటి, సినిమాటోగ్రఫీ: అజరు వి నాగ్, అనంత్ నాగ్ కావూరి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, లిరిక్స్: డాక్టర్ జివాగో, ఆర్ట్: ఉపేందర్ రెడ్డి, కొరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, ఫైట్స్: సి.హెచ్. రామకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ.