Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్'. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓమ్ రౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా అప్ డేట్ కోసం అటు ప్రభాస్ అభిమానులతో పాటు ఇటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ 'ఆదిపురుష్' టీజర్ పోస్టర్ రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించింది.
అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓంరావత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మెట్తో పాటు త్రీడీలోనూ ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు దీటుగా సినిమా ఉంటుందని, ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులకు మంచి థ్రిల్ ఇచ్చే సినిమా అని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.