Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది ప్రారంభంలోనే 'డీజే టిల్లు', 'భీమ్లా నాయక్' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'స్వాతిముత్యం'. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా ఈనెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. థియేటర్ నుంచి నిస్సందేహంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు.
అయితే అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా తీశామని చెప్పను. పండగ రోజు థియేటర్కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే
బయటకు వస్తారు. అయితే ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ని ఇందులో టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ని ఫన్ టోన్లో చెప్పాం.
లక్ష్మణ్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం. ఇక 'స్వాతిముత్యం' అనే టైటిల్ పెట్టడానికి కారణం హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకుల్లోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.
'స్వాతిముత్యం' అంటే పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా ఉంటాడు. ఈ సినిమాతో గణేష్ మంచి కాన్సెప్ట్తో వచ్చాడన్న పేరు వస్తుంది.'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో వర్ష బొల్లమ్మ నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని తీసుకున్నాం.
మా సితారలో 'డీజే టిల్లు' నుంచే ప్రయోగాత్మక చిత్రాలను స్టార్ట్ చేశాం. అలాగే మేం అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. 'డీజే టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం' ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. వీటితోపాటు ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.
గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలతో పాటు మా సినిమాని విడుదల చేస్తున్నాం. అయితే ఇదేమీ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు పెద్ద సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.
ఇటీవల ప్రీ రిలీజ్లో మా సినిమా గురించి మెగాస్టార్ విషెస్ తెలియజేయటం ఆనందంగా ఉంది. మీలాగే నేను కూడా మా బ్యానర్లో చిరంజీవి ప్రాజెక్ట్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను.
ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' సినిమాలకు థియేటర్స్లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి, పిచ్చిగా చూసి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది.