Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'క్రేజీ ఫెలో'.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'క్రేజీ ఫెలో' టైటిల్కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్తో క్యూరియాసిటీని పెంచిందీ ట్రైలర్.
''మావాడు చాలా మారిపోయాడు. ఇంతకుముందులా లేడు' అని సప్తగిరికి అనీష్ కురువిల్లా చెప్పిన తర్వాత.. డాక్టర్ సమరానికి ఎవరో రాసిన ఉత్తరం చదువుతూ ఆది పాత్ర రివీల్ కావడం చాలా క్రేజీగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్, ఆఫీస్లో వచ్చిన కొన్ని సీన్స్ కంప్లీట్ ఫన్ని పంచాయి. ట్రైలర్లో బాలత్రిపుర సుందరి పాట ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా కథపై ఆసక్తిని పెంచాయి. ఇక ట్రైలర్ చివర్లో 'పుణ్యానికి పోతే పాప ఎదురైంది' అని ఆది చెప్పిన డైలాగ్ హిలేరియస్గా ఉంది. ట్రైలర్లో ఆది తన స్టయిలీష్ లుక్స్, యాక్షన్తో అలరించాడు. ఆది కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ అందంగా కనిపించారు. సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఆర్ఆర్ ధవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్గా ఉంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ లావిష్గా ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, ట్రైలర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈనెల 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా నిర్మాతలు ప్రకటించారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాత : కేకే రాధమోహన్, రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి, సంగీతం : ఆర్ఆర్ ద్రువన్, డీవోపీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ : కొలికపోగు రమేష్, ఎడిటర్: సత్య గిడుతూరి, యాక్షన్: రామకృష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్.కుమార్.