Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పది సంవత్సరాల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో ఇండిస్టీకి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది. చివరికు తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనే చిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'తార'. వి.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో 'కేరాఫ్ కంచర పాలెం' ఫేమ్ కిషోర్ హీరోగా, సత్యకృష్ణ హీరోయిన్గా, బేబీ తుషార, బేబీ నాగ హాసిని, మాస్టర్ హర్ష వర్ధన్, అజరు ఘోష్ నటీనటులుగా నటిస్తున్నారు. యం.బి (మల్లి బాబు)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటరమణ పసుపులేటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.4 చిత్రమిది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామా నాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ తొలి షాట్కు క్లాప్ నివ్వగా, నటుడు, నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేశారు.గూడ రామకృష్ణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో దర్శకుడు యం.బి మాట్లాడుతూ, 'అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 14 నుంచి ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్తో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మంచి కథను ఎంపిక చేసుకుని, మేం తీస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వదించాలని కోరుకుంటు న్నాను' అని అన్నారు.
'మంచి కంటెంట్తో వస్తున్న ఈ సినిమా మా బానర్లో నాలుగవ సినిమా. ఈ సినిమాతో మా అబ్బాయి యం.బి (మల్లి బాబు)ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను' అని నిర్మాత పసుపులేటి వెంకటరమణ చెప్పారు.
కో ప్రొడ్యూసర్ సాయిమల్లి అరుణ్ రామ్ మాట్లాడుతూ, ' దర్శకుడు యం.బి కొత్త కథ, కథనంతో రూపొందించ బోయే ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.