Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత పదేళ్ళుగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా 'అలీతో సరదాగా', 'వావ్', 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్ షోలను డిజైన్ చేసి, దర్శకత్వం వహించారు అనిల్ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్ పార్ట్ను దగ్గరుండి చూసుకుంటూ, నిర్మాతగా ప్రవీణా కడియాల వ్యవహరించారు. భార్యభర్తలైన ఈ ఇద్దరూ మరో సరికొత్త రియాలిటీ షో 'మిస్టర్ అండ్ మిసెస్' (ఒకరికి ఒకరు అనే ట్యాగ్లైన్)తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పది ఫేమస్ జంటలతో ఉండే ఈ షో గురించి నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ, 'ఈటీవిలో నేడు (మంగళవారం) మిస్టర్ అండ్ మిసెస్ షో ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం రాత్రి 9:30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోకి నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం ఓ విశేషమైతే, నటుడు శివబాలాజి మరొక జడ్జిగా ఉండటం మరో విశేషం. బ్లాక్బస్టర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్కి వెళ్లి, గ్రాండ్ ఫినాలే టైటిల్తో పాటు భారీ ప్రైజ్మనీని సొంతం చేసుకుంటారు. ఈ షోలో రవికిరణ్ -సుష్మా, పవన్-అంజలి, సందీప్ -జ్యోతి, హ్రితేష్- ప్రియా, శ్రీవాణి- విక్రమ్, మధు- ప్రియాంక, ప్రీతమ్-మానస, సిద్దు-విష్ణుప్రియ, రాకేశ్ -సుజాత, విశ్వ-శ్రద్ధ జంటలు పాల్గొంటున్నాయి. ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్నారు' అని తెలిపారు.