Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భలే భలే మగాడివోరు, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన జీఎ2 పిక్చర్స్లో రాబోతున్న తదుపరి చిత్రం 'ఉర్వశివో రాక్షసివో'.
'కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి' వంటి చిత్రాలతో మంచి జనాదరణ అందుకున్న కథానాయకుడు అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రమిది. ఈ చిత్రానికి 'విజేత' సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించింది.
'ఇప్పటికే రిలీజ్ చేసిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్ర టీజర్కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో భాగంగా సోమవారం ఈ చిత్రం నుండి ''ధీంతననా'' అనే మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు.
'నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా..నీ పాదమే దాటు ప్రతిచోటునా..నీ పెదవులు తాకే నా పేరును వింటా..ఓ స్పర్శ కే పొంగిపోతానట..కాలం కలిపింది ఈ జోడి బాగుందని'' అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ చేసిన ఈ పాటలో శిరీష్, అను ఇమాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్లో మరో క్లాసి మెలోడీ యాడ్ అయింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ జీఎ2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజరు ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
'మా బ్యానర్లో రూపొందుతున్న మరో హిట్ చిత్రమిది. ఓ మంచి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఇందులో నాయకానాయికలుగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ఎంతో అద్భుతంగా నటించారు. వీరి పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్, మ్యూజిక్.. ఇలా దేన్ని తీసుకున్నా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాతో మా బ్యానర్కి మరింత మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే అల్లు శిరీష్ కెరీర్లో మరో హిట్ సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నాం. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఎన్నో సినిమాలు నిరూపించాయి. వాటి కోవలోకి మా చిత్రం వస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని మేకర్స్ అన్నారు.
అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: రాకేష్ శశి, సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి, నిర్మాత: ధీరజ్ మొగిలినేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబు, డీఓపీ :తన్వీర్, ఎడిటర్ :కార్తీక శ్రీనివాస్.