Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ హీరోగా నటించిన 'బిల్లా' సినిమా రీ-రిలీజ్కు రెడీ అవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం మేం అనుకున్న దానికంటే కృష్ణంరాజు ఎక్కువ సపోర్ట్ చేశారు. రెండు హెలికాప్టర్లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కష్ణంరాజు నటించాలనే ఆలోచన ప్రభాస్దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం. వాస్తవానికి ఈ 4కే షోను ఆయన ముఖ్య అతిథిగా పిలిచి, ప్రదర్శించాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మనకు దూరమయ్యారు. ప్రభాస్ కెరీర్లో బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ అయ్యింది. ది బెస్ట్ క్వాలిటీతో వరల్డ్ వైడ్గా ఈ నెల 23న బిల్లా చిత్రాన్ని 4కె వర్షెన్లో రిలీజ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ అంతా ఎంజారు చేయండి' అని అన్నారు. 'ఈ సినిమా సంగీతం సాధించిన విజయం మీ అందరికీ తెలిసిందే. 'బిల్లా' వంద రోజుల తర్వాత తమిళంలో హీరో విజరుతో ఓ సినిమా చేసేందుకు వెళ్లాను. కథ విన్నాక మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడని అడిగితే మీ 'బిల్లా' పాటలన్నీ మాకు ఇచ్చేయండి, ఈ సినిమాలో పెట్టుకుంటామన్నారు. 'బిల్లా' పాటల క్రేజ్ అలాంటిది' అని సంగీత దర్శకుడు మణిశర్మ చెప్పారు.
'బిల్లా' సినిమాతో మాకెన్నో మెమొరీస్ ఉన్నాయి. గోపీకృష్ణా మూవీస్లో డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రంగా మాకెంతో స్పెషల్ ఈ మూవీ. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. అన్నయ్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రీ-రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్కు ఇవ్వబోతున్నాం. నాన్న కృష్ణంరాజు ఈ ఫౌండేషన్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం. నాన్నలాగే మేమూ ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తాం.
- కృష్ణంరాజు తనయ, నిర్మాత ప్రసీధ