Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌరీ నాయుడు సమర్పణలో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి., ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'శశివదనే'. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మాణ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు జరిపిన చిత్రీకరణతో ఈ సినిమా మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. అద్భుతమైన అనుభవం, జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియో క్లిప్ ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి అద్భుతమైన నిదర్శనం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్గా ఉండబోతున్నాయి. గోదావరి ల్యాండ్స్కేప్ నేపథ్యంలో గ్రాండియర్, హై స్టాండర్డ్స్తో సన్నివేశాలు వస్తాయి. 'పలాస 1978' సినిమాతో అందరి దష్టిని ఆకర్షించిన రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన సెలెక్ట్ చేసుకున్న గోదావరి నేపథ్యంలోని లవ్, యాక్షన్ డ్రామా చిత్రాన్ని చాలా అందంగా తెరకెక్కించాడు. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది' అని చెప్పారు. రఘు కుంచె, ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సంగీతం: శరవణ వాసుదేవన్, రచన-దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.