Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కార్తి, పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా ఈనెల 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తోంది. నాగార్జున ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,'కార్తితో 'ఊపిరి' సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేసినందుకు కార్తి గర్వపడుతున్నానని చెప్పారు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు' అని తెలిపారు.
'నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఈ సినిమాని నాగార్జున తెలుగులో విడుదల చేయడం చాలా థ్రిల్గా ఉంది. ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్కు తగ్గట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. పిఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు' అని హీరో కార్తి అన్నారు.