Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కార్తి, 'అభిమన్యుడు' దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'సర్దార్'.
తెలుగు, తమిళంలో బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల రన్లో అసాధారణమైన బిజినెస్ సాధించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రాశిఖన్నా, రజిషా విజయన్, లైలా ఈ సినిమాలోని ప్రముఖ తారాగణం.
ప్రేక్షకుల విశేష ఆదరణతో అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి పార్ట్ 2 చేయబోతున్నట్టు గతంలో టీమ్ హింట్స్ ఇచ్చింది. అయితే ఆ హింట్స్ని నిజం చేస్తూ బుధవారం 'సర్దార్' చిత్రానికి సీక్వెల్గా 'సర్దార్ 2' చేయబోతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లనుంది.
'కార్తీ పోషించిన సర్దార్ కొడుకు పాత్రను రా ఏజెంట్గా చేరమని ఆఫర్ చేయగా, అతను అంగీకరించాడు. నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోంది. 'సర్దార్' కోసం పని చేసిన టీమ్ దీనికి కూడా పని చేస్తుంది. 'సర్దార్'లో కార్తి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తి విలక్షణమైన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులని సైతం ఆకట్టుకుంది. దర్శకుడు మిత్రన్ బ్రిలియంట్ కంటెంట్తో మెస్మరైజ్ చేశారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో రానున్న ఈ సీక్వెల్ క్రేజీ ప్రాజెక్ట్గా ప్రేక్షకులని అలరించబోతుంది. జార్జ్ సి విలియమ్స్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సీక్వెల్ని నిర్మించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.