Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సుధీర్ బాబు 18వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 'సెహరి' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
'ఎనౌన్స్మెంట్ పోస్టర్లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యంకు వచ్చిన ఇన్ల్యాండ్ లెటర్ కనిపిస్తుంది. 'క్రిటికల్: నీ రాక అవసరం' అనే మెసేజ్ కూడా అందులో ఉంది. తుపాకీ, బుల్లెట్లు, పాత ఐదువందల రూపాయి నోటు, ల్యాండ్లైన్ ఫోన్, సిగార్ తో పాటు పోస్టర్లో దేవాలయం, గ్రామ వాతావరణం కనిపిస్తుంది. అక్టోబరు 31న మాస్ సంభవం' అని ఆ రోజు వచ్చే అప్డేట్ గురించి పోస్టర్లో సూచించారు మేకర్స్. ఇదొక దైవిక అంశంతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ కథ 1989 కుప్పంలో జరుగుతుంది. ఇది సరైన నేటివిటీ చిత్రం, ఇది సుధీర్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో ప్రెజెంట్ చేస్తుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు' అని చిత్ర బృందం తెలిపింది.