Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్'. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్ టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయిక. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నాయిక ఫరియా అబ్దుల్లా మీడియాతో ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఇది చాలా మంచి ఎంటర్టైనింగ్ కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ ఉన్న స్క్రిప్ట్. ఈ కథ ట్రావెలింగ్ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపథ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది. ఇందులో నేను ట్రావెల్ బ్లాగర్గా కనిపిస్తా. వీడియోస్ కోసం దేశమంతా తిరిగే పాత్ర ఇది. ఈ ప్రయాణంలో హీరోని కలుస్తా.
తను కూడా ఒక ట్రావెల్ బ్లాగర్. ఈ సినిమా ప్రయాణంలో చాలా మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వలనే జరిగింది. థాయిలాండ్లో ఒక పాట షూట్ చేయడం కోసం వెళ్లాను. మర్చిపోలేని జ్ఞాపకం ఇది. నేను నటించిన 'జాతిరత్నాలు', అలాగే ఈ సినిమా ట్రైలర్ని ప్రభాస్ విడుదల చేయడం చాలా లక్కీ ఛార్మ్గా ఫీలౌతున్నా. 'జాతిరత్నాలు' మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. హీరో సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు మేర్లపాక గాంధీతో పని చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఫన్ కూడా చాలా నేచురల్గా ఉంటుంది. ఇది అడ్వంచర్ మూవీ కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. 40 శాతం సినిమా అడవిలో జరుగుతుంది. ఇరవై రోజులు అడవిలోనే ఉన్నాం. ప్రస్తుతం తమిళంలో సుశింధిరన్ దర్శకత్వంలో విజయ్ అంటోనీ హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో రవితేజ 'రావణాసుర'తోపాటు ఒక హిందీ వెబ్ సిరిస్ చేస్తున్నా. పాత్రలు ఎంచుకునే విషయంలో నాకు ఎలాంటి లిమిటేషన్లు లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని ఉంది. అలాగే నాకు ఆర్ట్ ఫిలిమ్స్, మ్యూజికల్ ఫిలిమ్స్ ఇష్టం. దర్శకత్వం చేయాలని కూడా ఉంది. అయితే పదేళ్ళ తర్వాతే దాని గురించి ఆలోచిస్తా' అని ఫరియా అబ్దుల్లా చెప్పారు.