Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాలరిపేట నేపథ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కొరమీను'. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటీనటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్ర మోషన్ పోస్టర్ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి శనివారం విడుదల చేశారు.
'ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘావృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బోట్స్ కనిపించగా, అందులోని ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' అని ఉండటం, బిజీఎం, సెట్టింగ్, పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్గా ఎంతో తీక్షణమైన లుక్తో చూసే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది. దర్శకుడు శ్రీపతి కర్రి సినిమా గురించి మాట్లాడుతూ, 'జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు, వైజాగ్లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని అన్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ఆనంద్ రవి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెరచ సంగీతం: అనంత నారాయణన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, ప్రొడక్షన్ డిజైనర్: మూసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్, జానా స్వామి, సాహిత్యం: పూర్ణాచారి, లక్ష్మీ ప్రియాంక.