Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మించిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. చిత్రానికి అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,'ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో మా సినిమా మరోసారి రుజువు చేసింది. ఇంత అద్భుతమైన టాక్ రావడానికి కారణమైన ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకపోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్. అందరూ తప్పక చూడాల్సిన సినిమా. మానవ విలువలు తగ్గిపోతున్న కాలంలో వాటిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ సినిమాని తీశాం. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు గొప్ప ఫీలింగ్ని ఇంటివరకూ తీసుకెళ్తున్నారు. ఈ సినిమాని మిగతా భాషలల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తాం' అని తెలిపారు. 'ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీలౌతున్నారు. చాలా సీరియస్ కథ ఇది. దీన్ని ఎంటర్ టైనింగ్ చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ వల్లే సాధ్యపడింది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు' దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల అన్నారు. నిర్మాత డా.జగన్ మోహన్ డి వై మాట్లాడుతూ, 'చాలా అరుదుగా ఇలాంటి సినిమాలు వస్తాయని అందరూ ప్రశంసిస్తున్నారు' అని చెప్పారు.