Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ది కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో పాటు తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా నిర్మాత అభిషేక్ అగర్వాల్ మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కోవిడ్ సమయంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అభిషేక్ అగర్వాల్, ఆయన కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ హైదరాబాద్లోని జే ఆర్సీ కన్వెన్షన్లో గ్రాండ్గా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో అనుపమ్ ఖేర్, వివేక్ అగ్ని హౌత్రి, పల్లవి జోషి, పీవీ సింధు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి నందగోపాల్, కావ్య రెడ్డి, స్నేహలతా అగర్వాల్, నిశాంత్ అగర్వాల్, అర్చన అగర్వాల్, సోనమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ని ఆవిష్కరించారు. తిమ్మాపూర్ గ్రామ విద్యార్ధులు కూడా ఈ వేడుకకు హాజరవ్వడం విశేషం.
''అభిషేక్ అగర్వాల్ కుటుంబం ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం మరింత ఆనందకరమైన విషయం. గొప్ప పనులు చేసేవారికి అందరి ఆశీస్సులు ఉంటాయి' అని అనుపమ్ ఖేర్ అన్నారు.