Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మయూఖి'. ఈ చిత్ర పోస్టర్ను ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు. ఏ.ఎల్. నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డల్లాస్ ఘర్షణలో అనే క్యాప్షన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్గా సాగిపోయే ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకుంది. ఈ యాక్షన్, ఎడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుంది.
ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించాం. ఇవి ఖచ్చితంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని నితిన్ కుమార్ తెలిపారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో సాగిపోయే చిత్రానికి మాటలు : గణపతి రామం, ఎడిటింగ్: జి. అశోక్ కుమార్, ఎన్.వినరు, ఎఫెక్ట్స్: కె. రాజేష్, ప్రొడక్షన్ డిజైనర్: యు.సందీప్, సినిమాటోగ్రఫీ : కె. అనిల్, ఎ.ఎల్. నితిన్ కుమార్, సంగీతం: లుబెక్ లీ మార్విన్, నిర్మాతలు: నంద కిషోర్, డి.టెరెన్స్, కథ, దర్శకత్వం: ఏ.ఎల్. నితిన్ కుమార్.